YouVersion Logo
Search Icon

యిర్మీయా 47

47
ఫిలిప్తీయుల గురించిన సందేశం
1ప్రవక్తయైన యిర్మీయాకు యెహోవా నుండి ఈ సందేశం వచ్చింది. ఆ వర్తమానం ఫిలిష్తీయులను గురించినది. గాజా నగరంపై ఫరో దాడి చేయటానికి ముందుగా ఈ వర్తమానం వచ్చింది.
2యెహోవా ఇలా చెపుతున్నాడు,
“చూడు, శత్రుసైనికులు ఉత్తరాన సమకూడుతున్నారు.
శరవేగంతో పొంగి ప్రవహించే నదిలా వారు వస్తారు.
దేశాన్నంతా ఒక మహా వెల్లువలా వారు ఆవరిస్తారు.
వారు అన్ని పట్టణాలను, వాటి ప్రజలను చుట్టుముడతారు. దేశంలో ప్రతి పౌరుడూ సహాయంకొరకు ఆక్రందిస్తాడు.
3పరుగెత్తే గుర్రపు డెక్కల చప్పుడు వారు వింటారు.
రథాల చప్పుడు వారు వింటారు. కదిలే చక్రాల రణగొణ ధ్వని వారు వింటారు.
తండ్రులు తమ పిల్లలకు రక్షణ కల్పించలేరు.
ఆ తండ్రులు సహాయం చేయలేనంత బలహీనులవుతారు.
4ఫిలిష్తీయులనందరినీ యెహోవా
త్వరలో నాశనం చేస్తాడు!
తూరు, సీదోనులకు సహాయపడే మిగిలిన
వారందరినీ నాశనం చేస్తాడు.
ఫిలిష్తీయులను యెహోవా అతి త్వరలో నాశనం చేస్తాడు.
క్రేతు#47:4 క్రేతు “కఫ్తోరు” ద్వీపమని దీని శబ్దార్థం. దీన్ని కొన్ని సార్లు క్రేతు అని, మరికొన్ని సార్లు కుప్ర అని అనటం కద్దు. బైబిలు ప్రకారం ఫిలిష్తీయులు ప్రథమంగా కఫ్తోరునుండి వచ్చారు. ద్వీపవాసులలో మిగిలిన వారందరినీ ఆయన నాశనం చేస్తాడు.
5గాజా ప్రజలు ధుఃఖంతో తమ తలలు గొరిగించుకుంటారు.
ఆష్కెలోను ప్రజల నోరు నొక్కబడుతుంది.
లోయలో మిగిలిన ప్రజలారా, ఎంతకాలం మిమ్మల్ని మీరు గాయపర్చుకుంటారు?#47:5 ఎంతకాలం … గాయపర్చుకుంటారు తమ విచారాన్ని సూచించేందుకు ప్రజలు తమ శరీరాలను చీరుకొని గాయపర్చుకునేవారు.
6“ఓ యెహోవా ఖడ్గమా, నీవు ఎంతకాలము పోరాడెదవు.
నీ ఒరలోనికి నీవు వెళ్లుము!
ఆగిపో! శాంతించు, అని మీరంటారు.
7కాని యెహోవా ఖడ్గం ఏ విధంగా విశ్రాంతి తీసుకుంటుంది?
యెహోవా దానికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు.
అష్కెలోను నగరాన్ని, సముద్ర తీరాన్ని
ఎదుర్కొనమని యెహోవా దానికి ఆజ్ఞ ఇచ్చాడు.”

Highlight

Copy

Compare

Share

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Video for యిర్మీయా 47