ఎందుకంటే మహాఘనుడు, మహోన్నతుడు,
పరిశుద్ధుడు, నిత్యనివాసియైన దేవుడు ఇలా చెప్తున్నారు:
“నేను ఉన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసిస్తాను,
అంతేకాక వినయం గలవారి ఆత్మకు చైతన్యం కలిగించడానికి
నలిగినవారి ప్రాణానికి చైతన్యం కలిగించడానికి
ఆత్మలో వినయం, దీనమనస్సు గలవారి దగ్గర నివసిస్తాను.
నేను వారిని నిత్యం నిందించను,
నేను ఎప్పుడు కోపంగా ఉండను
ఎందుకంటే నా వలన వారు నీరసించిపోతారు.
నేను పుట్టించిన ప్రజలు నీరసించిపోతారు.