యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు,
“రాబోయే రోజుల్లో పంట కోసేవారిని దున్నేవాడు దాటిపోతాడు,
నాటే వారిని ద్రాక్ష పండ్లు త్రొక్కేవాడు దాటిపోతాడు,
నూతన ద్రాక్షరసం పర్వతాలమీద నుండి,
అన్ని కొండల నుండి ప్రవహిస్తుంది.
నేను నా ఇశ్రాయేలు ప్రజలను బందీల నుండి తిరిగి తీసుకువస్తాను.
“వారు శిథిలమైన పట్టణాలను పునర్నిర్మించుకుని వాటిలో నివసిస్తారు.
వారు ద్రాక్షతోటలు వేసి వాటి ద్రాక్షరసం త్రాగుతారు;
వారు వనాలు నాటి వాటి పండ్లు తింటారు.