యోబు 19:23-29

యోబు 19:23-29 TSA

“నా మాటలు ఒక గ్రంథపుచుట్టలో, వ్రాయబడి ఉంటే బాగుండేది! అవి నిత్యం ఉండేలా ఇనుపగంటతో రాతి మీద చెక్కి సీసంతో నింపితే బాగుండేది! నా విమోచకుడు సజీవుడని, తుదకు ఆయన భూమి మీద నిలబడతారని నాకు తెలుసు. నా చర్మం నాశనమైపోయిన తర్వాత నా శరీరంతో నేను దేవుని చూస్తాను. మరొకరు కాదు, నేనే నా కళ్ళతో స్వయంగా దేవుని చూస్తాను. నా హృదయం నాలో ఎంత ఆరాటపడుతుంది! “ఒకవేళ మీరు, ‘దీనికంతటికి మూలకారణం అతనిలోనే ఉంది, అతన్ని మనమెలా వేటాడాలి’ అని అనుకుంటే, మీరు ఖడ్గానికి భయపడాలి; ఎందుకంటే కోపమనే ఖడ్గం శిక్షను విధిస్తుంది, అప్పుడు మీరు తీర్పు ఉందని తెలుసుకుంటారు.”

చదువండి యోబు 19